K Kavitha: విచారణకు రమ్మంటూ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నోటీసులు
  • ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలన్న సీబీఐ
  • హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ విచారణకు హాజరు కావచ్చన్న సీబీఐ
CBI issues notices to Kavitha

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఉందనే కోణంలో సీబీఐ విచారణ జరపనుంది. 

కవితకు సీబీఐ నోటీసులు జారీ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.

More Telugu News