205 కిలోల ఉల్లి పంటకు రూ.8.36 పైసలు.. కర్ణాటక రైతుకు వచ్చిన ఆదాయం ఇది!
30-11-2022 Wed 10:55 | Offbeat
- 400 కి.మీ. దూరం తీసుకెళ్లి అమ్మితే వచ్చిన మొత్తం సొమ్ము ఇదంటూ రైతు ఆవేదన
- దారిలో టీ తాగేందుకూ ఆ డబ్బు సరిపోదని నిర్వేదం
- పెట్టుబడి ఖర్చు రూ.25 వేలకు పైనే అయిందని వెల్లడి
- ట్విట్టర్ లో మార్కెట్ రిసీట్ ఫొటో వైరల్

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్మితే నాలుగు రూపాయలు కళ్లజూడొచ్చని రైతులు ఆశపడతారు. కొంచెం రేటు ఎక్కువ పలుకుతుందని తెలిస్తే దూరం ఎక్కువైనా సరే తన పంటను కష్టపడి తీసుకెళతారు. తీరా అక్కడ పంట మొత్తం అమ్మాక దారి ఖర్చులకూ సరిపడిన సొమ్ము కూడా అందకుంటే..? కర్ణాటకకు చెందిన ఓ రైతుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా.. ఆయనకు అందింది కేవలం రూ.8.36 పైసలు. అవును.. అక్షరాలా ఎనిమిది రూపాయల ముప్పై ఆరు పైసలు మాత్రమే! ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వివరాలు..
కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా కొద్దిగా తగ్గింది. పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరికొంతమంది రైతులతో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా సరైన రేటు లేకపోయినా గత్యంతరం లేక, దారిఖర్చులకన్నా ఉపయోగపడతాయని క్వింటాల్ రూ.200 చొప్పున అమ్మేశాడు. అయితే, దారిఖర్చులకు కాదు కదా.. దారిలో టీ తాగేందుకు సరిపడా సొమ్ము కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పంట మొత్తం తీసుకున్న వ్యాపారి లెక్కలు కట్టి తన చేతిలో రూ.8.36 పైసలు పెట్టడంతో పెవడెప్ప అవాక్కయ్యాడు. ఇదేంటని అడిగితే.. మొత్తం 205 కిలోలకు రూ.410. అందులో ఫ్రైట్ చార్జీలు రూ.377.64, హమాలీ ఖర్చు రూ.24 లను తీసేస్తే మిగిలేది రూ.8.36 పైసలేనని లెక్కచెప్పాడట. పంట పండించేందుకు తనకు సుమారు రూ.25 వేల దాకా ఖర్చయిందని రైతు చెప్పుకొచ్చాడు. తనలాగా మరో రైతు ఇబ్బంది పడకూడదని, యశ్వంత్ పూర్ మార్కెట్ కు రావొద్దని చెప్పాడు. కాగా, పెవడెప్ప పంట అమ్మకానికి సంబంధించిన రిసీట్ ను ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా కొద్దిగా తగ్గింది. పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరికొంతమంది రైతులతో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా సరైన రేటు లేకపోయినా గత్యంతరం లేక, దారిఖర్చులకన్నా ఉపయోగపడతాయని క్వింటాల్ రూ.200 చొప్పున అమ్మేశాడు. అయితే, దారిఖర్చులకు కాదు కదా.. దారిలో టీ తాగేందుకు సరిపడా సొమ్ము కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పంట మొత్తం తీసుకున్న వ్యాపారి లెక్కలు కట్టి తన చేతిలో రూ.8.36 పైసలు పెట్టడంతో పెవడెప్ప అవాక్కయ్యాడు. ఇదేంటని అడిగితే.. మొత్తం 205 కిలోలకు రూ.410. అందులో ఫ్రైట్ చార్జీలు రూ.377.64, హమాలీ ఖర్చు రూ.24 లను తీసేస్తే మిగిలేది రూ.8.36 పైసలేనని లెక్కచెప్పాడట. పంట పండించేందుకు తనకు సుమారు రూ.25 వేల దాకా ఖర్చయిందని రైతు చెప్పుకొచ్చాడు. తనలాగా మరో రైతు ఇబ్బంది పడకూడదని, యశ్వంత్ పూర్ మార్కెట్ కు రావొద్దని చెప్పాడు. కాగా, పెవడెప్ప పంట అమ్మకానికి సంబంధించిన రిసీట్ ను ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
Advertisement lz
More Telugu News

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
10 minutes ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
17 minutes ago

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి
34 minutes ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
57 minutes ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
1 hour ago

ఎమ్మెల్సీ తలశిల రఘురాంను ఓదార్చిన సీఎం జగన్
2 hours ago

ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల
2 hours ago

బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
2 hours ago

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
3 hours ago

ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
3 hours ago

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
4 hours ago


స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు
5 hours ago

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ షాకింగ్ కామెంట్స్
6 hours ago

కోటంరెడ్డి భద్రత 1 ప్లస్ 1 కు తగ్గింపు
8 hours ago
Advertisement
Video News

Viral video: 15 Passengers Ejected from Flight After Women's Brawl Over Seat
10 minutes ago
Advertisement 36

CM KCR Public Meeting LIVE: BRS Public Meeting @ Nanded
53 minutes ago

Nara Lokesh Visits Kanipakam Varasiddhi Vinayaka Temple: Drone Visuals
1 hour ago

CBI Speeds Up Investigation On YS Viveka Murder Case
1 hour ago

Ex-cricketer Vinod Kambli Charged with Domestic Violence: Wife Alleges Assault and Injury
1 hour ago

Actress Pooja Hegde's airport look goes viral
1 hour ago

Senior Gynecologist 'Dr Balamba' on breastfeeding, cesareans, and more, exclusive interview
2 hours ago

Centre blocks 232 China apps
2 hours ago

Pakistan's former president Pervez Musharraf passes away
3 hours ago

Officials cover excavated Visakhapatnam's Rushikonda with geo mats
3 hours ago

MLA Kotamreddy Sridhar Reddy surprises all with return gift to state government
4 hours ago

Title track of Upendra, Shriya's 'Kabzaa' is a must-listen for music and film fans
4 hours ago

Two students killed after auto turn turtle in Nandyal
4 hours ago

Live: MLA Shilpa Ravi Press Meet
5 hours ago

Actress Samantha reacts to Akhil Akkineni's Instagram post
5 hours ago

AIMIM to contest in 50 seats in upcoming Telangana elections: Owaisi
5 hours ago