ఆస్ట్రేలియా అమ్మాయిని భారతీయ వ్యక్తి ఎందుకు హత్య చేశాడంటే...!
26-11-2022 Sat 14:25 | National
- 2018లో ఆస్ట్రేలియా అమ్మాయి హత్య
- క్వీన్స్ లాండ్ బీచ్ లో శవమై తేలిన టోయా
- భారత్ కు పారిపోయి వచ్చిన రజ్వీందర్ సింగ్
- తాజాగా ఢిల్లీలో అరెస్ట్
- త్వరలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగింత

ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి, భారత్ కు పారిపోయిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ యువతిని అతడు ఎందుకు చంపాడో నాలుగేళ్ల తర్వాత కారణం వెల్లడైంది.
2018లో క్వీన్స్ లాండ్ లో రజ్వీందర్ సింగ్ అనే భారతీయ వ్యక్తి... బీచ్ లో టోయా కార్డింగ్లే అనే అమ్మాయిని కడతేర్చాడు. హత్య చేసిన రెండ్రోజుల తర్వాత రజ్వీందర్ ఆస్ట్రేలియా నుంచి పరారయ్యాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిపై రూ.5.50 కోట్ల నజరానా ప్రకటించింది. అతడిని పట్టించడంలో సాయపడాలంటూ భారత కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరింది.
ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్డు వద్ద రజ్వీందర్ సింగ్ ను స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఆసక్తికర సంగతులు వెల్లడించారు.
రజ్వీందర్ సింగ్ ఇన్నిస్ ఫాయిల్ లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. హత్య జరిగిన రోజున రజ్వీందర్ సింగ్ భార్యతో గొడవపడి బీచ్ కు వెళ్లాడు. ఓ ఫార్మసీ వర్కర్ అయిన టోయా అదే సమయంలో తన కుక్కతో షికారుగా బీచ్ కు వచ్చింది. అక్కడే ఉన్న రజ్వీందర్ ను చూసి కుక్క అరవడం మొదలుపెట్టింది. దాంతో ఆగ్రహానికి గురైన రజ్వీందర్ సింగ్.... కుక్క యజమాని టోయాతో వాగ్వాదానికి దిగాడు.
అనంతరం ఆవేశంతో తన వద్ద ఉన్న కత్తితో టోయాను పొడిచి చంపాడు. ఆమె మృతదేహాన్ని ఇసుకలో పూడ్చివేసి, కుక్కను అక్కడే ఓ చెట్టుకు కట్టేసి పరారయ్యాడు. అరెస్ట్ భయంతో ఉద్యోగం వదిలేసి, భార్య, ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి భారత్ కు పారిపోయి వచ్చాడు.
అతడి అరెస్ట్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేసింది. రజ్వీందర్ సింగ్ ను అరెస్ట్ చేయడం కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ నెల 21న అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రజ్వీందర్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో త్వరలోనే అతడిని క్వీన్స్ లాండ్ పోలీసులకు అప్పగించనున్నారు.
2018లో క్వీన్స్ లాండ్ లో రజ్వీందర్ సింగ్ అనే భారతీయ వ్యక్తి... బీచ్ లో టోయా కార్డింగ్లే అనే అమ్మాయిని కడతేర్చాడు. హత్య చేసిన రెండ్రోజుల తర్వాత రజ్వీందర్ ఆస్ట్రేలియా నుంచి పరారయ్యాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిపై రూ.5.50 కోట్ల నజరానా ప్రకటించింది. అతడిని పట్టించడంలో సాయపడాలంటూ భారత కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరింది.
ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్డు వద్ద రజ్వీందర్ సింగ్ ను స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఆసక్తికర సంగతులు వెల్లడించారు.
రజ్వీందర్ సింగ్ ఇన్నిస్ ఫాయిల్ లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. హత్య జరిగిన రోజున రజ్వీందర్ సింగ్ భార్యతో గొడవపడి బీచ్ కు వెళ్లాడు. ఓ ఫార్మసీ వర్కర్ అయిన టోయా అదే సమయంలో తన కుక్కతో షికారుగా బీచ్ కు వచ్చింది. అక్కడే ఉన్న రజ్వీందర్ ను చూసి కుక్క అరవడం మొదలుపెట్టింది. దాంతో ఆగ్రహానికి గురైన రజ్వీందర్ సింగ్.... కుక్క యజమాని టోయాతో వాగ్వాదానికి దిగాడు.
అనంతరం ఆవేశంతో తన వద్ద ఉన్న కత్తితో టోయాను పొడిచి చంపాడు. ఆమె మృతదేహాన్ని ఇసుకలో పూడ్చివేసి, కుక్కను అక్కడే ఓ చెట్టుకు కట్టేసి పరారయ్యాడు. అరెస్ట్ భయంతో ఉద్యోగం వదిలేసి, భార్య, ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి భారత్ కు పారిపోయి వచ్చాడు.
అతడి అరెస్ట్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేసింది. రజ్వీందర్ సింగ్ ను అరెస్ట్ చేయడం కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ నెల 21న అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రజ్వీందర్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో త్వరలోనే అతడిని క్వీన్స్ లాండ్ పోలీసులకు అప్పగించనున్నారు.
Advertisement
Advertisement lz
More Telugu News

మళ్లీ వస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్
9 hours ago

చిరంజీవిగారు నాకు బ్రదర్ లా కనిపించారు: చరణ్
9 hours ago

మంత్రి కేటీఆర్ కు అభినందనలు: ప్రభాస్
9 hours ago

పాదయాత్రలో చంటిబిడ్డకు నామకరణం చేసిన లోకేశ్
10 hours ago

అన్న తారకరత్న ఆరోగ్యంపై కల్యాణ్ రామ్ ట్వీట్.. వైరల్
11 hours ago



'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ!
12 hours ago

రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ కు పేరు మార్పు
14 hours ago

అలా చేస్తే జంధ్యాలకి చాలా కోపం వచ్చేదట!
15 hours ago

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో చెత్త చెత్త.. ఫొటో ఇదిగో!
16 hours ago

జనసైనికులకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజ్ఞప్తి
16 hours ago

ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
16 hours ago

అమెరికాలో పోలీసుల దాడిలో యువకుడి మృతి.. వీడియో వైరల్
16 hours ago
Advertisement
Video News

Road caves in Hyderabad's Himayat Nagar, vehicle gets stuck
21 minutes ago
Advertisement 36

Rashtrapati Bhavan's Mughal Gardens renamed "Amrit Udyan"
44 minutes ago

Brother Chaitanya Krishna reacts over Tarak Ratna's critical health condition
8 hours ago

9 PM Telugu News- 28th January 2023
8 hours ago

Chandrababu reacts on Taraka Ratna's health condition in Bengaluru
10 hours ago

Purandeswari speaks to media after visiting Tarak Ratna in Bengaluru hospital
11 hours ago

Chandrababu Visits Taraka Ratna in Hospital - Live
11 hours ago

Hindupur TDP leaders perform special puja for Tarak Ratna's recovery
12 hours ago

Chandrababu to reach Bengaluru to see ailing Tarak Ratna!
12 hours ago

TSRTC launched Pilot Project of Radio services in 9 City Buses in Hyderabad
13 hours ago

Yuvagalam: Nara Lokesh receives warm welcome at Kuppam Govt Degree College
13 hours ago

Butta Bomma Trailer- A Love Saga With Unexpected Turns
13 hours ago

KTR heartfelt condolences over the death of Amshala Swamy, face of Nalgonda fluorosis
14 hours ago

KTR inaugurated Hyderabad Triple IT Silver Jubilee Talk Series
14 hours ago

MP Avinash Reddy appears before CBI in YS Viveka murder case: Lawyer denied access
14 hours ago

Latest Health Bulletin of Taraka Ratna Released
15 hours ago