Chiranjeevi: ప్రతిష్ఠాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందన

Chiranjeevi reaction on Indian Film Personality Of The Year award
  • నేటి నుంచి గోవాలో ఇఫీ చలనచిత్రోత్సవం
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా చిరంజీవి
  • అవార్డు ప్రకటించిన కేంద్రం
  • కేంద్రానికి, ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
గోవాలో ప్రారంభమైన ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందించారు. 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి వివరించారు. 

అంతకుముందు, చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022గా ప్రకటిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు.
Chiranjeevi
Indian Film Personality Of The Year award
Anurag Thakur
Tollywood

More Telugu News