Kotaiah: తెనాలిలో దారుణం... భార్యను హత్య చేసి నివాళి అర్పించిన భర్త!

  • కోటయ్య, స్వాతి దంపతులు
  • తెనాలిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న స్వాతి
  • భార్యపై అనుమానం పెంచుకున్న కోటయ్య
  • బ్యూటీపార్లర్ వద్ద భార్యతో ఘర్షణ
  • కత్తితో నరికి చంపిన వైనం
  • మృతదేహంపై పూలదండ వేసి నివాళులు
Man kills wife and paid homage in Tenali

గుంటూరు జిల్లా తెనాలి టౌన్ లో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపి, సంఘటన స్థలంలోనే ఆమెకు నివాళులు అర్పించడం సంచలనం సృష్టించింది. కోటయ్య, కాకర్ల స్వాతి దంపతులు తెనాలిలోని నాజర్ పేటలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాతి గాంధీనగర్ లో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతోంది. 

అయితే, స్వాతి ప్రవర్తనపై భర్త కోటయ్య కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో, నేడు మధ్యాహ్నం మద్యం మత్తులో కోటయ్య భార్య స్వాతితో గొడవపడ్డాడు. బ్యూటీపార్లర్ వస్తూనే కత్తి, ఓ పూలదండ కూడా తీసుకునివచ్చాడు. 

ఘర్షణ పెరిగిపెద్దదవడంతో కోటయ్య తీవ్ర ఆగ్రహంతో స్వాతిని కత్తితో నరికి చంపాడు. అనంతరం, ఆమె మృతదేహంపై పూలదండ వేసి నివాళులు అర్పించాడు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. కోటయ్య తీరుతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ హత్య అనంతరం కోటయ్య తెనాలి రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

More Telugu News