పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థీవ దేహం.. కడచూపు కోసం పోటెత్తిన ప్రముఖులు, అభిమానులు
- ఈ ఉదయం నానక్ రామ్ గూడ నుంచి స్టూడియోకు తరలింపు
- నివాళులు అర్పించిన బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు తదితరులు
- ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకూ ఊరేగింపుగా కృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్తారు. కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్లు బంద్కి పిలుపునిచ్చింది. పలుచోట్ల సినిమా హాల్లను మూసివేశారు. మరోవైపు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.