చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
- పది సెకన్లపాటు కంపించిన భూమి
- 15 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు ప్రకంపనలు
- భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు
15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. కాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు.