కేసీఆర్పై షర్మిల విమర్శలు.. పాదయాత్రలో ఉద్రిక్తత
- పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కొనసాగుతున్న పాదయాత్ర
- ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదంటూ షర్మిల విమర్శలు
- వైటీపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు
- న్యూ కొత్తపల్లి సమీపంలో రోడ్డుపై బైఠాయించిన టీఆర్ఎస్ కార్యకర్తలు
టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడిచేసేందుకు వచ్చారని, వారిపై కేసులు నమోదు చేయాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర కొనసాగింది. అయితే, న్యూ కొత్తపల్లి సమీపంలో మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి పాదయాత్ర ముందుకు సాగకుండా అడ్డుకున్నాయి. పోలీసులు వారిని పక్కకు తప్పించడంతో పాదయాత్ర ముందుకు కదిలింది. అనంతరం పాదయాత్ర చామనపల్లికి చేరుకుంది. అక్కడ షర్మిల మాట్లాడుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్పై విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యల పరిష్కారంపై పాదయాత్ర చేస్తున్న ఆడబిడ్డపై దాడిచేయాలనుకునే వారు మహిళల కంటే తక్కువేనని అన్నారు.