శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి జిహాద్పై పాఠాలు చెప్పాడంటూ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- జిహాద్ భావన గీతలో ప్రస్తావించారన్న కాంగ్రెస్ సీనియర్ నేత
- తీవ్రంగా స్పందించిన బీజేపీ
- కాంగ్రెస్ హిందూ ద్వేషి అని విమర్శించిన బీజేపీ నేత షెషజాద్
కాగా, శివరాజ్ జిహాద్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ప్రతి స్పందించింది. బీజేపీ ప్రతినిధి షెహజాద్ జైహింద్ కాంగ్రెస్ను హిందూ ద్వేషి అని ఆరోపించారు. రాముడి ఉనికిని వ్యతిరేకిస్తోందన్నారు.
‘ఆప్కి చెందిన గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ తర్వాత శ్రీ కృష్ణుడు అర్జునుడికి జిహాద్ నేర్పించాడని కాంగ్రెస్ శివరాజ్ పాటిల్ చెబుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ హిందూ సమూహాల కంటే ఎల్ఈటీ తక్కువ ప్రమాదకరమైనదన్నారు. దిగ్విజయ్ సింగ్ 26/11 ఉగ్రదాడుల విషయంలో హిందువులను నిందించారు’ అని షెహజాద్ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.