వేలానికి కింగ్ చార్లెస్ వివాహం నాటి కేకు ముక్క.. రూ. 27 వేల నుంచి వేలం మొదలు
- 41 సంవత్సరాల క్రితం కింగ్ చార్లెస్-డయానా దంపతుల వివాహం
- ఆ సమయంలో 43 కేకులను కట్ చేసిన చార్లెస్ దంపతులు
- ఫ్రూట్ కేకులో ముక్కకు తాజాగా వేలం
ఈ కేకు ముక్కకు భారీ ధర పలికే అవకాశం ఉందని ‘న్యూయార్క్ పోస్ట్’ తెలిపింది. 41 సంవత్సరాల క్రితం కేకును ఎలాగైతే ప్యాక్ చేసి విక్రయించారో ఈ ముక్కను కూడా అలాగే ప్యాక్ చేసి వేలం వేయనున్నారు. అప్పట్లో కింగ్ చార్లెస్ దంపతులు తమ వివాహం సందర్భంగా మొత్తం 43 కేకులు కట్ చేశారు. వేలానికొచ్చిన ఈ కేకు ముక్క ఫ్రూట్ కేకులోనిదని గుర్తించారు. కాగా, చార్లెస్ దంపతుల వివాహానికి సంబంధించిన ఓ కేకు ముక్కను 2014లో ఇదే సంస్థ వేలం వేసింది. అప్పట్లో దానికి భారత కరెన్సీలో రూ. 1.27 లక్షలు పలికింది.