విశాఖలో వైసీపీ నాయకులపై దాడి కేసు.. అర్ధరాత్రి జనసేన నాయకుల అరెస్ట్
- రోజా ఇతర నాయకులపై జనసేన శ్రేణుల రాళ్లదాడి
- కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
- పవన్ బస చేసిన నోవాటెల్ వద్ద భారీ భద్రత
మంత్రి రోజా, ఇతర వైసీపీ నాయకులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడ వారిపై రాళ్లతోను, జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ జనసేన నాయకులు వారిని దూషిస్తూ దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమైనట్టు తెలిపారు. మరోవైపు, జన సేనాని పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. పవన్ బస చేసిన ఫ్లోర్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్లో పవన్తోపాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా బస చేశారు. నోవాటెల్ వైపు వచ్చే కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.