Chiranjeevi: సంక్రాంతికి బరిలోకి దిగుతున్న 'వాల్తేరు వీరయ్య'

  • చిరూ 154వ సినిమాగా 'వాల్తేరు వీరయ్య'
  • ముగింపు దశలో ఉన్న చిత్రీకరణ 
  • కథానాయికగా శ్రుతి హాసన్ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
Valtheru Veerayya Update

చిరంజీవి 153వ సినిమాగా వచ్చిన 'గాడ్ ఫాదర్' ఘనవిజయాన్ని సాధించింది. దాంతో ఆయన 154వ సినిమా అయిన 'వాల్తేరు వీరయ్య'ను విడుదలకి సిద్ధం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. 

ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్ తో కనిపించనున్నారు. ఆయన యాస .. డైలాగ్ డెలివరీ .. లుక్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. ఇటీవల కాలంలో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో, ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. 

అయితే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్టుగా మేకర్స్ అప్ డేట్ వదిలారు. సాధారణంగా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకున్న తరువాతనే డబ్బింగ్ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉంటారు. అందువలన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది

More Telugu News