వివాదంలో నయనతార దంపతులు... సరోగసీపై వివరణ కోరిన తమిళనాడు సర్కారు
- సరోగసీ ద్వారా కవల పిల్లలను కన్న నయనతార దంపతులు
- ఈ వ్యవహారంపై తమిళనాడు ఆరోగ్య శాఖ ఆరా
- సరోగసీపై వివరాలను నయన్ దంపతులు ప్రభుత్వానికి తెలియజేయాలన్న తమిళనాడు మంత్రి
ఈ క్రమంలో నయనతార దంపతులకు కలిగిన పిల్లల వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. సరోగసీపై వివరాలను నయన్, విఘ్నేష్లు ప్రభుత్వానికి అందజేయాలని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మ ణియన్ అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.