రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌నానికి హాజ‌రు కానున్న ప్ర‌భాస్‌

prabhas invited to tomorrows ravan dahan at delhi ramleela maidan
టాలీవుడ్ అగ్ర హీరో ప్ర‌భాస్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో వేడుక‌గా జ‌రిగే రావ‌ణ ద‌హ‌నానికి హాజ‌రు కావాలంటూ ఆయ‌న‌కు ఆహ్వానం అందింది. ఈ మేర‌కు ప్ర‌భాస్‌కు రాంలీలా క‌మిటీ నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముతో పాటు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ల‌తో క‌లిసి ప్ర‌భాస్ ఈ వేడుక‌కు హాజ‌రు కానున్నారు.

క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు. క‌రోనా విస్తృతి భారీగా త‌గ్గిపోయిన నేప‌థ్యంలో ఈ ఏడాది రావ‌ణ ద‌హ‌న వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు రాంలీలా క‌మిటీ తీర్మానించింది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌నానికి హాజరు కావాలంటూ ఆయ‌న‌కు రాంలీలా క‌మిటీ ప్ర‌త్యేకంగా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం మేర‌కు ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ఉన్న ప్ర‌భాస్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీకి బ‌య‌లుదేరారు.
Go Back to Shorts
Tollywood
Prabhas
Adipurush
Ramleela Maidan
New Delhi

More Telugu News