భారత్లో 5జీ సేవలు ప్రారంభం.. నాలుగు నగరాల్లోనే అందుబాటులోకి
01-10-2022 Sat 11:12 | National
- ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- ఈ నెలలో 4 నగరాల్లో సేవలు అందుబాటులోకి తేనున్న జియో 5జీ
- దేశం మొత్తం రావడనికి రెండేళ్లు పట్టే అవకాశం

భారత్లో 5జీ సేవలు శనివారం మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి. అదానీ గ్రూప్ తన సొంత అవసరాల కోసం స్పెక్ర్టమ్ ను కొన్నది.
రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ, ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5జీ సర్వీస్ ను దశల వారీగా అందించాలని తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్రధాన నగరాలు.. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెలఖరు వరకు ఈ నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో జియో 5జీ సేవలు పొందాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి 5జీ సేవలు ఈ రోజే మొదలైనా.. అందరూ దాన్ని ఉపయోగించడం కుదరదు. తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఇప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వాస్తవానికి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాల్లో కూడా దీపావళి నాటికి కొన్ని ప్రాంతాల్లోనే జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్లో ఇప్పుడు సేవలకు 5జీ సిద్ధంగా ఉంది. అక్కడి ప్రయాణికులు 20 రెట్ల వేగవంతమైన కనెక్టివిటీని పొందుతారు. 5జీ సేవలు ప్రారంభించిన తర్వాత రెండు, మూడేళ్లలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.
రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ, ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5జీ సర్వీస్ ను దశల వారీగా అందించాలని తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్రధాన నగరాలు.. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెలఖరు వరకు ఈ నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో జియో 5జీ సేవలు పొందాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి 5జీ సేవలు ఈ రోజే మొదలైనా.. అందరూ దాన్ని ఉపయోగించడం కుదరదు. తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఇప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వాస్తవానికి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాల్లో కూడా దీపావళి నాటికి కొన్ని ప్రాంతాల్లోనే జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్లో ఇప్పుడు సేవలకు 5జీ సిద్ధంగా ఉంది. అక్కడి ప్రయాణికులు 20 రెట్ల వేగవంతమైన కనెక్టివిటీని పొందుతారు. 5జీ సేవలు ప్రారంభించిన తర్వాత రెండు, మూడేళ్లలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.
Advertisement lz
More Telugu News


వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
8 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
9 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
11 hours ago


ఇటీవల ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిపాలయ్యాను: ఇలియానా
12 hours ago

విజయ్ కు టీడీపీ అండగా ఉంటుంది: పట్టాభి
13 hours ago

అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ వీడ్కోలు
13 hours ago

రాజమౌళి చేతుల మీదుగా 'దసరా' సినిమా టీజర్ రిలీజ్!
13 hours ago

పాకిస్థాన్ మసీదులో ఉగ్రదాడి... 46 మంది మృతి
13 hours ago




6 వేల మందిని తొలగిస్తున్నాం.. ఫిలిప్స్ ప్రకటన
14 hours ago

అప్పుడు మాత్రం చాలా భయమేసింది: హీరో సందీప్ కిషన్
14 hours ago

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
15 hours ago

తారకరత్నకు ముగిసిన 48 గంటల అబ్జర్వేషన్
15 hours ago

‘హంపి ఉత్సవ్’లో కైలాశ్ ఖేర్కు చేదు అనుభవం
15 hours ago

యూపీ సీఎం యోగిని కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్
15 hours ago

కశ్మీర్ లో చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్, ప్రియాంక
15 hours ago
Advertisement
Video News

Pawan Kalyan appreciates Janasainik's innovative attempt to know social problems
6 hours ago
Advertisement 36

9 PM Telugu News: 30th January 2023
7 hours ago

MLA Kotamreddy Sridhar Reddy likely to say goodbye to Politics
7 hours ago

Kamal Haasan Lands in Kadapa for Indian 2 Shooting; Locals Rush To See Him!
8 hours ago

Taraka Ratna Latest Health Bulletin Released
9 hours ago

NRIs extend support to Nara Lokesh 'Yuvagalam' Padayatra
9 hours ago

Witch Hunt Against PM Modi; Indian Diaspora In London Protests Outside BBC Headquarters
10 hours ago

Live: CM Jagan's special flight makes emergency landing
11 hours ago

Budget Breakthrough: Telangana Governor and Government Settle Dispute
11 hours ago

Vallabhaneni Vamsi Files Defamation Suit Against TDP Leaders Bachula and Pattabhi
11 hours ago

Nara Lokesh slams CM Jagan about his promise of Job Calendar
12 hours ago

Union Cabinet Expansion: Names of these Telangana MPs in race for Union Minister post!
12 hours ago

Dasara Telugu Teaser out: Nani shows fierce avatar
12 hours ago

War of Words between Adani Group & Hindenburg
13 hours ago

Taraka Ratna's condition is improving, says Ramakrishna
13 hours ago

Rahul Gandhi's Full Speech at Bharath Jodo Yatra Closing Ceremony
13 hours ago