Andhra Pradesh: ఈ నెల 26 నుంచి ఏపీలో ద‌స‌రా సెల‌వులు

Dussehra holidays in ap starts from 26th of this month
షార్ట్స్‌లో చూడండి
ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఏపీలోని పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఈ నెల 26 నుంచి ఏపీలో ద‌సరా సెల‌వులు మొద‌లు కానున్నాయి. అదే విధంగా వ‌చ్చే నెల (అక్టోబ‌ర్‌) 6 వ‌ర‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. అక్టోబ‌ర్ 7న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తంగా 11 రోజుల పాటు పాఠశాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి ద‌స‌రా సెల‌వులను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌గా... పాఠ‌శాల‌ల‌కు మాత్రం 25న‌నే సెల‌వులు ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే ఈ నెల 25న ఆదివారం కాబ‌ట్టి. ఈ సెల‌వులు సాధార‌ణ పాఠ‌శాల‌ల‌కు మాత్ర‌మే. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6 వరకు సెలవులు ఇస్తూ ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ పాఠ‌శాల‌లు కూడా ఇత‌ర‌త్రా పాఠ‌శాల‌ల మాదిరే అక్టోబ‌ర్ 7న పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఈ విద్యా సంవ‌త్స‌రంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలువులుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
Go Back to Shorts
Andhra Pradesh
Dussehra
AP Schools

More Telugu News