తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వినాయక విగ్రహం ఇదే!
- దొండపర్తిలో 102 అడుగుల గణేశ్ విగ్రహం
- ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ యువసేన
- పూర్తిగా మట్టితో తయారైన విగ్రహం
- స్వామివారితో పాటు 102 కిలోల లడ్డూ
దొండపర్తిలో వైఎస్ జగన్ యువసేన 102 అడుగుల భారీ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం మొత్తం మట్టితోనే తయారుచేయడం విశేషం. ఈ విగ్రహంతో పాటు 102 కిలోల లడ్డు కూడా ఉంచారు.
దొండపర్తి వినాయకుడ్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుండడంతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ విగ్రహాన్ని 21 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.