Andhra Pradesh: ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను ప్ర‌క‌టించిన కేంద్రం... మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సోము వీర్రాజు

  • తూర్పుగోదావ‌రి జిల్లా కేసీ పురంలో బల్క్ డ్ర‌గ్ పార్క్‌కు కేంద్రం ఆమోదం
  • రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసిన కేంద్ర ప్ర‌భుత్వం
  • న‌రేంద్ర మోదీ, జేపీ న‌డ్డాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన వీర్రాజు
union government approves a bulk drug park to andhra pradesh

ఏపీకి కేంద్రం మ‌రో పారిశ్రామిక పార్క్‌ను కేటాయించింది. రాష్ట్రంలోని తూర్పు గోదావ‌రి జిల్లా కేసీ పురంలో బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సోష‌ల్ మీడియాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

ఏపీకి బల్క్ డ్ర‌గ్ పార్క్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని సోము వీర్రాజు త‌న ట్వీట్‌లో తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రం ఓ లేఖ రాసింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను కేటాయించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News