మోదీతో భేటీ తర్వాత.. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, రాష్ట్రపతిలతో జగన్ సమావేశం
- మోదీతో అరగంట పాటు జగన్ భేటీ
- కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తో జగన్ సమావేశం
- తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని వినతి
- రాష్ట్రపతి ముర్ముకు అభినందనలు తెలిపిన జగన్
ఆర్కే సింగ్ తో భేటీ తర్వాత సోమవారం మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి భవన్కు జగన్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం చేశాక..తొలిసారిగా ఢిల్లీకి వెళ్లిన జగన్ మర్యాదపూర్వకంగానే ఆమెతో భేటీ అయ్యారు.