భాగ్యనగరిలో త్రివర్ణంలోకి మారిపోయిన ఫ్లై ఓవర్లు... వీడియో ఇదిగో
- దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశవ్యాప్తంగా వేడుకలు
- తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరిట వేడుకలు
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన త్రివర్ణ శోభిత ఫ్లై ఓవర్
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 15 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజధాని హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు త్రివర్ణంలోకి మారిపోయాయి. నగరంలోని ఫ్లై ఓవర్లు కూడా మువ్వన్నెల రంగును అద్దుకున్నాయి. ఇలా త్రివర్ణంలోకి మారిపోయిన ఓ ఫ్లై ఓవర్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.