లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- ఉత్సాహంగా నేటి ట్రేడింగ్
- ప్రభావం చూపిన అమెరికా ఫ్యాక్టర్
- ప్రైవేటు రంగ బ్యాంకులకు లాభాలు
- ఎస్బీఐకి నిరాశ
- డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.21
ముఖ్యంగా, ఆటోమొబైల్, మెటల్, ప్రైవేటు బ్యాంకులు ఇవాళ్టి ట్రేడింగ్ లో లాభాలు కళ్లజూశాయి. కానీ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మాత్రం నిరాశాజనక ఫలితాలు నమోదు చేసింది.
అమెరికాలో ఉద్యోగాలకు సంబంధించి కీలక నివేదిక, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ స్థాయిలో వడ్డీ రేట్ల పెంపుదల నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు ప్రపంచ మార్కెట్ స్థితిగతులపై ప్రభావం చూపించాయి. ఇక, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.21గా ఉంది.