Telangana: ఏ క్ష‌ణ‌మైనా పిడుగు ప‌డొచ్చంటూ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • టీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న తుమ్మ‌ల
  • కార్య‌క‌ర్త‌లంతా సిద్ధంగా ఉండాల‌ని పిలుపు  
  • ముందస్తు ఎన్నికల నిర్ణయం జరిగిందా అన్న విశ్లేషణలు  
trs senior leader tummala nageswara rao viral comments

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గా కొన‌సాగుతున్న మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బుధ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏ క్ష‌ణ‌మైనా పిడుగు ప‌డొచ్చ‌ని చెప్పిన తుమ్మ‌ల... కార్య‌క‌ర్త‌లంతా సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.  

ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని తుమ్మల వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల దిశగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకుందా? అన్న దిశగా చర్చ సాగుతోంది. ఇప్పటికే 2018లో మాదిరిగానే ఈ దఫా కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని విపక్షాలు చెబుతుండగా... టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చంటూ తుమ్మల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

More Telugu News