రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ భేటీ
- రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసిన హరిచందన్
- రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన వైనం
- ఇద్దరూ ఒడిశాకు చెందిన వారే
భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముర్మును ఆయన అభినందించారు. ఇదిలా ఉంటే... ముర్ముతో పాటు హరిచందన్ కూడా ఒడిశా రాష్ట్రానికే చెందిన వారు. ఇద్దరూ తమ రాష్ట్ర మంత్రివర్గాల్లో సభ్యులుగా కొనసాగిన వారే. హరిచందన్ మాదిరిగా గతంలో ముర్ము కూడా ఝార్ఖండ్ గవర్నర్గా వ్యవహరించారు.