ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ బ‌య‌లుదేరిన కేసీఆర్‌... సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌య‌నం

ts cm kcr takes off from begumpet to delhi
  • బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌త్యేక విమానంలో పయనం  
  • రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం  
  • ప‌లు పార్టీల నేత‌ల‌తో కేసీఆర్ మంత‌నాలు సాగించే అవ‌కాశం
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోమ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీకి బ‌య‌లుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరిన కేసీఆర్‌తో తెలంగాణ కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు బ‌య‌లుదేరారు. వీరంతా కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసేదాకా ఆయ‌న‌తో పాటే ఉండ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్లారు.

కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎన్ని రోజుల పాటు జ‌రుగుతుంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌మైన స‌మాచార‌మేదీ లేదు. అయితే, రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు పార్టీల‌కు చెందిన జాతీయ స్థాయి నేత‌ల‌తో కేసీఆర్ మంత‌నాలు సాగిస్తార‌ని సమాచారం. 
Go Back to Shorts
TRS
KCR
Telangana
Delhi Tour

More Telugu News