చంద్రబాబు టూర్లో మాజీ మంత్రి పర్సు కొట్టేసిన దొంగలు
- వరద ప్రాంతాల్లో 2 రోజులు పర్యటించిన చంద్రబాబు
- చంద్రబాబు వెంట ఉత్సాహంగా పాల్గొన్న గొల్లపల్లి
- మాయమైన పర్సులో రూ.35 వేల నగదు, 2 ఏటీఎం కార్డులు
గొల్లపల్లి సూర్యారావు పోగొట్టుకున్న పర్సులో రూ.35 వేల నగదుతో పాటు 2 ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయట. చంద్రబాబు పర్యటన ముగిశాక తీరా తన జేబులో చేయి పెడితే.. అందులో పర్సు లేని విషయాన్ని గుర్తించిన సూర్యారావు షాక్ తిన్నారు. ఆ వెంటనే తేరుకుని ఆయన నేరుగా రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.