రూ.10 లక్షల పెట్టుబడితో ఏడాదిలో కోటి టర్నోవర్!... పులివెందులలో 'జగనన్న మహిళా మార్ట్' విజయగాథ!
- 10,200 మంది మహిళలు రూ.150 చొప్పున పొదుపు
- రూ.10 లక్షలతో పులివెందులలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు
- మొత్తంగా మహిళలతోనే నిర్వహణ కొనసాగుతున్న వైనం
ఈ మార్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పరిధిలోని పులివెందులలో 1,270 పొదుపు సంఘాలు ఉండగా... వాటిలోని 10,200 మంది ఒక్కొక్కరు రూ.150 మేర పొదుపు చేసి రూ.10 లక్షలను సమకూర్చారు. ఈ మొత్తంతో పులివెందులలో జగనన్న మహిళా మార్ట్ పేరిట ఓ సూపర్ మార్కెట్ను ప్రారంభించారు. ఇది ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవర్ను సాధించింది. మొత్తం మహిళలలే నిర్వహిస్తున్న ఈ మార్ట్ కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగానే రాణిస్తుండటం గమనార్హం.