Janasena: రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా వెళ్ల‌లేక‌పోతున్నాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

pawan kalyan invited for the farewell to ramnath kovind but he did not attend it
  • రామ్ నాథ్ కోవింద్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌నున్న కేంద్రం
  • ఈ స‌భ‌కు ప‌వ‌న్‌కు ఆహ్వానం పంపిన కేంద్ర ప్ర‌భుత్వం
  • అనారోగ్యంతో వెళ్ల‌లేకపోతున్నాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌
భార‌త రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ప‌దవీ కాలం ముగియనుండటంతో శుక్ర‌వారం (ఈ నెల 22) ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వం ఆయనకు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌నుంది. అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి రావాలంటూ దేశంలోని కీల‌క నేత‌లంద‌రికీ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.

ఈ ఆహ్వ‌నాల్లో ఒక‌టి తెలుగు నేల‌కు చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా అందింది. ఈ విషయాన్ని ప‌వ‌న్ గురువారం రాత్రి ప్ర‌క‌టించారు. అయితే అనారోగ్య కార‌ణాల వ‌ల్ల తాను ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న అనంత‌రం ప‌వ‌న్ వైర‌ల్ ఫీవ‌ర్‌కు గురైన సంగ‌తి తెలిసిందే.

ఈ వేడుక‌కు త‌న‌ను ఆహ్వానించిన ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప‌వ‌న్‌... ఈ చారిత్ర‌క స‌భ‌కు అనారోగ్య కార‌ణాల‌తో హాజ‌రుకాలేక‌పోతున్నాన‌ని తెలిపారు. ఎలాంటి పొర‌పొచ్చాల‌కు తావులేకుండా రామ్ నాథ్ కోవింద్ ప‌నిచేశార‌ని ప‌వ‌న్ కొనియాడారు. 
Janasena
BJP
Prime Minister
Narendra Modi
Amit Shah
Pawan Kalyan
Ram Nath Kovind

More Telugu News