చివరి వన్డేలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ... విజయంపై కన్నేసిన టీమిండియా

Team India won the toss against England in the series decider
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా నేడు చివరి వన్డే ఆడుతోంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. 

ఇంగ్లండ్ పర్యటనలో రీషెడ్యూల్డ్ టెస్టు ఓడిపోయిన టీమిండియా, ఆ తర్వాత టీ20 సిరీస్ ను చేజిక్కించుకుని సత్తా చాటింది. ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా దక్కించుకుని సగర్వంగా పర్యటన ముగించాలని భావిస్తోంది. అయితే, భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా వీపు నొప్పితో ఈ మ్యాచ్ కు దూరం కావడం ప్రతికూలాంశం. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 

అటు, ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రెండో వన్డే నెగ్గిన జట్టునే బరిలో దింపుతున్నట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.
Go Back to Shorts
Team India
Toss
England
3rd ODI

More Telugu News