ఢిల్లీలో దారుణం.. టెన్త్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి కారులోనే సామూహిక అత్యాచారం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- మాయమాటలు చెప్పి బాలికను కారు ఎక్కించుకున్న నిందితులు
- నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం
- బాలిక స్నేహితుడు సహా ముగ్గురి అరెస్ట్
నిందితులు ఇద్దరితోపాటు బాలిక స్నేహితుడు కూడా వారి వెంట ఉన్నాడు. అనంతరం బాలికను మహిపాల్పూర్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులతోపాటు బాలిక స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.