వరదలో కొట్టుకుపోయిన ఎన్టీవీ జర్నలిస్టు మృతదేహం లభ్యం
- జగిత్యాలలో వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్
- వరదలో కారుతో సహా కొట్టుకుపోయిన జర్నలిస్టు
- శుక్రవారం ఉదయం కారును వెలికి తీసిన అధికారులు
- జమీర్ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం
కాగా, జమీర్ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ చ్చారు. ‘విధి నిర్వహణకు వెళ్ళి, వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరం. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తాము. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను’ అని కవిత ట్వీట్ చేశారు.