ఇంగ్లండ్‌లోనే ధోనీ... లార్డ్స్‌లో రైనాతో క‌లిసి సంద‌డి

ms dhoni spotted sith suresh raina at lords in london
టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ లండ‌న్ టూర్ ఇంకా ముగియ‌లేదు. చాలా రోజుల క్రిత‌మే ఫ్యామిలీతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన ధోనీ... ఇటీవ‌లే త‌న బ‌ర్త్ డేను కూడా అక్క‌డే సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ టూర్‌లోనే ఉన్న టీమిండియా జ‌ట్టు ఎక్క‌డికి వెళితే... ధోనీ కూడా అక్క‌డికే వెళుతున్నాడు. జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి మొన్న క‌నిపించిన ధోనీ... ఓవల్ స్టేడియంలో జ‌రిగిన తొలి వ‌న్డే సంద‌ర్భంగా వెస్టిండిస్ దిగ్గ‌జం గార్డ‌న్ గ్రీనిడ్జ్‌తో క‌లిసి క‌నిపించాడు.

తాజాగా గురువారం లండ‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జ‌ట్టుతో టీమిండియా రెండో వ‌న్డే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. టీమిండియా జ‌ట్టుతోనే సాగుతున్న ధోనీ..గురువారం జ‌ట్టుతో పాటే లండ‌న్ వ‌చ్చేశాడు. మ్యాచ్ జ‌రుగుతున్న‌ లార్డ్స్ స్టేడియానికి వ‌చ్చిన ధోనీ... త‌న స‌హ‌చ‌రుడు సురేశ్ రైనాతో క‌లిసి ఫొటోల‌కు పోజిచ్చాడు.
Go Back to Shorts
Team India
England
MS Dhoni
Suresh Raina
Lords
London

More Telugu News