హైపవర్ కమిటీతో ఏపీ మునిసిపల్ కార్మికుల చర్చలు విఫలం
- 9 డిమాండ్లతో మొదలైన మునిసిపల్ కార్మికుల సమ్మె
- సమ్మె విరమణ దిశగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన జగన్
- కార్మిక సంఘాలతో 2 గంటలకు పైగా కమిటీ భేటీ
- సమ్మెను కొనసాగించనున్నట్లు ప్రకటించిన కార్మికుల సంఘం నేతలు
సీఎం ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం సమీర్ శర్మలతో కూడిన హైపవర్ కమిటీ కార్మిక సంఘం నేతలతో చర్చలు జరిపింది. దాదాపుగా రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. వెరసి హైపవర్ కమిటీతో చర్చలు విఫలమైనట్లుగా కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. తమ సమ్మెను కొనసాగించనున్నట్లు వారు ప్రకటించారు.