Sania Mirza: వింబుల్డన్ కు భావోద్వేగంతో వీడ్కోలు పలికిన సానియామీర్జా.. ఇది మా గౌరవం అన్న వింబుల్డన్!

  • వింబుల్డన్ లో మిక్స్ డ్ డబుల్స్ లో ఓటమిపాలైన సానియా
  • డబ్ల్యూటీఏ సర్క్యూట్ నుంచి వైదొలగుతానని ఇంతకు ముందే ప్రకటించిన టెన్నిస్ తార
  • 2015లో వింబుల్డన్ విమెన్స్ డబుల్స్ ను గెలుపొందిన సానియా 
Sania Mirza says good bye to Wimbledon

భారత టెన్నిస్ దిగ్గజం సానియామీర్జా కెరీర్ లో ఒక కీలక అంకం ముగిసిపోయింది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ కు ఆమె వీడ్కోలు పలికింది. మిక్స్ డ్ డబుల్స్ సెమీస్ లో ఓటమిపాలైన తర్వాత ఆమె భావోద్వేగంతో స్పందించింది. 

'మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా క్రీడలు కీలకపాత్ర వహిస్తాయి. గెలుపులు, ఓటములు, గంటల కొద్దీ హార్డ్ వర్క్స్, ఎంతో పోరాడి ఓడిన తర్వాత నిద్రలేని రాత్రులు. కానీ ఇవన్నీ నీకు రిటర్న్ లో ఎంతో ఇస్తాయి. కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సంఘర్షణ... ఇవన్నీ కూడా చివరకు మన కష్టానికి దక్కే ఫలితాలే. వింబుల్డన్ ఒక అద్భుతం. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌవరం. ఐ మిస్ యూ' అంటూ సోషల్ మీడియాలో సానియా భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. 

డబ్ల్యూటీఏ సర్క్యూట్ నుంచి వైదొలగుతానని ఇంతకు ముందే సానియా ప్రకటించింది. చెప్పినట్టుగానే గుడ్ బై చెప్పింది. మరోవైపు 2015లో విమెన్స్ డబుల్స్ లో సానియామీర్జా టైటిట్ ను గెలుపొందింది. విమెన్స్ డబుల్స్ లో సానియా యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ లను గెలుచుకుంది. మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లను గెలుపొందింది. ఒకానొక సమయంలో విమెన్స్ డబుల్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా కూడా నిలబడింది. 2016 ఒలింపిక్స్ లో మిక్స్ డ్ డబుల్స్ లో ఆమె సెమీ ఫైనల్స్ లో ఓటమిపాలయింది. 

మరోవైపు సానియామీర్జా ప్రకటనపై వింబుల్డన్ స్పందించింది. 20 ఏళ్లు ఇక్కడ ఆడటం తనకు దక్కిన గౌరవం అన్న సానియా వ్యాఖ్యలపై వింబుల్డన్ స్పందిస్తూ... 'ఆ గౌరవం మాది సానియా' అని ట్వీట్ చేసింది. 2015 విమెన్స్ డబుల్స్ ఛాంపియన్ ఆల్ ది బెస్ట్ చెపుతున్నట్టు తెలిపింది.

More Telugu News