గుర్రంపై స్విగ్గీ ఆర్డర్ల డెలివరీ.. డెలివరీ బోయ్ ఆచూకీ చెప్పాలంటూ స్విగ్గీ ఆఫర్
- ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ బోయ్ సవారీ
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
- అతడి వివరాలు తమతో పంచుకోవాలని కోరిన స్విగ్గీ
- రూ.5,000 గిప్ట్ గా ఇస్తామని ప్రకటన
గుర్రంపై వెళుతున్న వ్యక్తి వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. ‘‘మా మోనోగ్రామ్డ్ డెలివరీ బ్యాగ్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి తెల్లటి గుర్రంపై కూర్చుని వెళుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తి సొంత ఆలోచన, వాహనం ఎంపికను మేము అభినందించాలని అనుకుంటున్నాం. మీ మాదిరే మేము కూడా ఆ వ్యక్తి ఎవరో గుర్తించలేకున్నాం’’ అంటూ స్విగ్గీ ప్రకటన విడుదల చేసింది.
‘‘దయచేసి ముందుకు రండి. ఉత్తమ భారత పౌరుడిగా మీ వంతు సహకారం అందించండి. ఎందుకంటే గుర్రంపై ఉన్న స్విగ్గీమ్యాన్ ఎవరో దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది’’ అని పేర్కొంది.