Team India: వెంటవెంటనే మూడు వికెట్లు తీసి మళ్లీ రేసులోకి వచ్చిన టీమిండియా

  • ఇంగ్లండ్ టార్గెట్ 378 రన్స్
  • తొలి వికెట్ కు 107 పరుగులు జోడించిన ఓపెనర్లు
  • రెండు పరుగుల తేడాతో 3 వికెట్లు డౌన్
  • బుమ్రాకు 2 వికెట్లు
Team India comes into fray after three quick wickets down

లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడైన ప్రదర్శన తర్వాత టీమిండియా మళ్లీ పుంజుకుంది. 2 పరుగుల తేడాతో మూడు వికెట్లు తీసి మళ్లీ రేసులోకొచ్చింది. జాక్ క్రాలే (46)ని అవుట్ చేయడం ద్వారా 107 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసిన బుమ్రా... కాసేపటికే ఓలీ పోప్ (0)ను డకౌట్ గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత అలెక్స్ లీస్ (56) రనౌట్ రూపంలో వెనుదిరగడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 31 ఓవర్లలో 3 వికెట్లకు 128 పరుగులు కాగా... జో రూట్ (16 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

More Telugu News