Team India: మరోసారి రాణించిన పంత్... 300 దాటిన టీమిండియా ఆధిక్యం

  • ఆసక్తికరంగా బర్మింగ్ హామ్ టెస్టు
  • పంత్ అర్ధసెంచరీ
  • రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • భారత్ ఆధిక్యం 326 పరుగులు
Team India lead edge past 300 mark in Birmingham

బర్మింగ్ హామ్ టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే దిశగా సాగుతోంది. రిషబ్ పంత్ మరోసారి బ్యాట్ కు పనిచెప్పడంతో టీమిండియా ఆధిక్యం 300 మార్కు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 60 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులు చేసి మాథ్యూ పాట్స్ కు వికెట్ అప్పగించాడు. ప్రస్తుతం పంత్ 53 పరుగులతోనూ, జడేజా 4 పరుగులతోనూ ఆడుతున్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 326 పరుగులకు చేరింది. అంతకుముందు, ఛటేశ్వర్ పుజారా 66 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

More Telugu News