సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడంతో పెద్ద హీరోలకు తీరని నష్టం: నిర్మాత బన్నీ వాసు
- 50 రోజుల దాకా కొత్త సినిమాలు ఓటీటీల్లోకి రావొద్దన్న బన్నీ వాసు
- ఈ దిశగా ఓ నిర్మాతతో అగ్ర హీరో ఒకరు ఒప్పందం చేసుకున్నారని వెల్లడి
- ఈ వ్యవహారంపై బుధవారం నిర్మాతల మండలి కీలక భేటీ అని ప్రకటన
టాలీవుడ్ హీరో గోపిచంద్ తాజా చిత్రం పక్కా కమర్షియల్ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త సినిమాలు విడుదలయ్యాక 50 రోజుల వరకు ఓటీటీల్లో రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా ఓ నిర్మాతతో అగ్ర హీరో ఒకరు ఒప్పందం కూడా చేసుకున్నారని బన్నీ వాసు వెల్లడించారు.