Bonda Uma: మైనార్టీలను జగన్ వాడుకుని మోసం చేశారు: బొండా ఉమ

  • ముస్లింలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు
  • దుల్హన్ పథకాన్ని జగన్ కొనసాగించాలి
  • మైనార్టీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం లేదు
Jagan deceived Minorities says Bonda Uma

ముస్లింలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత వాళ్లను వదిలేశారని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను టీడీపీ హయాంలో తీసుకొచ్చిన దుల్హన్ పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. దుల్హన్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ముస్లిం సంఘాల నాయకులు విజయవాడ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల కోసం మైనార్టీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని... ఈ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు అనేక లోన్లు ఇప్పించి, వారి అభివృద్ధికి కృషి చేశారని బొండా ఉమ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మైనార్టీలను వాడుకుని వదిలేసిన ఘనత జగన్ దని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాదిరే మైనార్టీలను ఆదుకుంటామని చెప్పారు.

More Telugu News