ఏయూ జేఏసీ ఫిర్యాదు.. అయ్యన్నపాత్రుడిపై మరో కేసు
- చోడవరం మినీ మహానాడులో ఏయూ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడారని ఫిర్యాదు
- సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు
- ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనక్కి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 41ఏ కింద అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు గత రాత్రి నర్సీపట్నంలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అయ్యన్న లేకపోవడంతో ఆయన పెద్దకుమారుడు విజయ్తో మాట్లాడారు. ఆ నోటీసులు తనకు ఇవ్వాలని విజయ్ కోరినా ఇవ్వకుండా ఆయనకే ఇస్తామని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని త్రీ టౌన్ సీఐ రామారావు నిర్ధారించారు.