ఒకేసారి 4 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
- తిరుపతి టూర్లో బిజీబిజీగా జగన్
- అపాచీ సహా 5 కంపెనీలకు భూమి పూజ చేసిన జగన్
- జగన్ సమక్షంలో 4 కంపెనీలతో ఏపీఈఐటీఏ ఒప్పందం
అనంతరం అక్కడే పీఓటీపీఎల్ ఎలక్ట్రానిక్స్, టెక్ బుల్స్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, జెట్ వర్క్ టెక్నాలజీస్ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. జగన్ సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ) అధికారులు ఆయా కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీకి ఏ మేర పెట్టుబడులు రానున్నాయన్న విషయం తెలియరాలేదు.