Nellore District: ముగిసిన ప్ర‌చారం... ఎల్లుండి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక పోలింగ్‌

  • మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగిసిన ప్ర‌చారం
  • ఈ నెల 23న ఉప ఎన్నిక పోలింగ్
  • సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ బ‌రికి దూరంగా టీడీపీ
  • వైసీపీ, బీజేపీ స‌హా బ‌రిలో 14 మంది అభ్య‌ర్థులు
campaign concludes in atmakur bypoll

ఏపీ దివంగ‌త మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు సంబంధించిన ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 23 (గురువారం)న ఉప ఎన్నిక‌ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పోలింగ్‌కు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి కాగా... నియోజ‌క‌వ‌ర్గంలోని 278 పోలింగ్ కేంద్రాల‌కు రేపు సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు.

ఇదిలా ఉంటే... గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌న అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డినే బ‌రిలోకి దించింది. దీంతో సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఈ క్ర‌మంలో వైసీపీ అభ్యర్థితో పాటు బీజేపీ స‌హా మొత్తం 14 మంది ఈ ఎన్నికల బ‌రిలో నిలిచారు.

More Telugu News