రేపు త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ
- అగ్నిపథ్ పథకంపైనే కీలక చర్చ
- ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో మోదీ
- రేపు మైసూరులో నిర్వహించనున్న యోగా డేలో పాల్గొననున్న ప్రధాని
- ఆ తర్వాత ఢిల్లీలో త్రివిధ దళాధిపతులతో భేటీ
సోమవారం కర్ణాటక పర్యటనకు వెళ్లిన మోదీ... మంగళవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించే యోగా డేలో పాలుపంచుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న ఆయన త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ పలు రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.