Hermit: కలకలం రేపుతున్న 'హెర్మిట్'... ఇది కూడా పెగాసస్ లాంటిదే!

  • నిఘా సాఫ్ట్ వేర్ లలో అగ్రగామిగా హెర్మిట్ 
  • ఉన్నతస్థాయి వ్యక్తులపై నిఘాకు వినియోగం
  • కజకిస్థాన్ ప్రభుత్వం వినియోగిస్తున్నట్టు గత ఏప్రిల్ లో వెల్లడి
Cyber researchers alerts about spyware Hermit

గతంలో పెగాసస్ స్పై సాఫ్ట్ వేర్ సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. పార్లమెంటులోనూ దీని ప్రకంపనలు వినిపించాయి. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ దీని సృష్టికర్త. తాజాగా, సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెర్మిట్ అనే మరో స్పై వేర్ గురించి అప్రమత్తం చేశారు.

ఇది ఆండ్రాయిడ్ ఆధారిత నిఘా సాఫ్ట్ వేర్. వ్యాపారవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యారంగ నిపుణులు, ఉన్నతాధికారులపై నిఘా వేసేందుకు ప్రభుత్వాలు హెర్మిట్ ను కూడా ఉపయోగిస్తాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సెమ్మెస్ ల ద్వారా ఈ స్పైవేర్ ను లక్షిత వ్యక్తుల ఫోన్లలోకి చొప్పిస్తారు. 

కజకిస్థాన్ ప్రభుత్వం హెర్మిట్ స్పైవేర్ ను ఉపయోగిస్తున్న విషయాన్ని లాకౌట్ త్రెట్ ల్యాబ్ అనే సైబర్ భద్రతా సంస్థ నిపుణులు గత ఏప్రిల్ లో గుర్తించారు. దాంతో కజకిస్థాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టగా, పోలీసులు ఉక్కుపాదం మోపారు.

హెర్మిట్ స్పైవేర్ ను ఇటలీకి చెందిన ఆర్సీఎస్ ల్యాబ్ అభివృద్ధి చేయగా, టైకెలాబ్ ఎస్సారెల్ అనే టెలికాం సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తోందని భావిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. హెర్మిట్ ప్రస్తావన ఇదే తొలిసారి కాదు. 2019లో ఓ అవినీతి ఆపరేషన్ కోసం ఇటలీ అధికారులు ఈ స్పైవేర్ ను ఉపయోగించినట్టు వెల్లడైంది. అంతేకాదు, కల్లోలభరితంగా ఉండే ఉత్తర సిరియాలో ఓ నటుడు కూడా ఈ హెర్మిట్ స్పైవేర్ ను వాడుతున్న విషయం గుర్తించినట్టు లాకౌట్ త్రెట్ ల్యాబ్ బృందం తెలిపింది. 

హెర్మిట్ స్పైవేర్ సృష్టికర్త ఆర్సీఎస్ ల్యాబ్ కు పాకిస్థాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్ మెనిస్థాన్ సైన్యాలు, నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

More Telugu News