టీ తాగడం తగ్గించుకోండి.. దేశాన్ని గట్టెక్కించండి.. పాక్ మంత్రి పిలుపు
- రుణాలు తీసుకుని తేయాకు దిగుమతి చేసుకుంటున్నట్టు వెల్లడి
- రోజులో ఒకటి రెండు కప్పులైనా తగ్గించుకోవాలని వినతి
- ఆర్థిక వ్యవస్థపై దిగుమతుల భారం పడుతోందన్న పాక్ మంత్రి
రుణాలు తీసుకుని పాకిస్థాన్ తేయాకును దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఇక్బాల్ ప్రస్తావించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పాకిస్థాన్ 2021-22లో 13 బిలియన్ డాలర్ల అదనపు తేయాకును దిగుమతి చేసుకుందని అక్కడి ఫెడరల్ బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం గమనార్హం.
గత వారమే పాక్ సర్కారు 2022-23 సంవత్సరానికి 47 బిలియన్ డాలర్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఐఎంఎఫ్ నుంచి 6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పొందడం కోసం (బెయిలవుట్ ప్యాకేజీ) ప్రస్తుతం పాక్ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఇలా పిలుపునివ్వడం గమనించాలి. పెరిగిపోయిన ఆహారం, చమురు ధరలతో పాక్ ప్రజలు జీవనానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.