Karnataka: రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ కి క్రాస్ ఓట్ వేశానని ప్రకటించిన జేడీఎస్ ఎమ్మెల్యే!

  • కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు
  • కాంగ్రెస్ కు ఓటు వేశానన్న జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ
  • కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఇష్టమని వ్యాఖ్య
JDS MLA annouces that he cross voted to Congress

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ను సమర్పించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. 

తాను ఓటు వేశానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటు వేశానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ను ప్రేమిస్తున్నానని... అందుకే ఆ పార్టీకి ఓటు వేశానని తెలిపారు. క్రాస్ ఓటు వేసిన శ్రీనివాస్ గౌడ కాంగ్రెస్ లో చేరుతానని గతంలో ప్రకటించిన సంగతి గమనార్హం. 

మరోవైపు, క్రాస్ ఓటింగ్ కు భయపడిన జేడీఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచింది. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

More Telugu News