రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్
- కర్ణాటకలోని కలబురిగి వద్ద ఘోరప్రమాదం
- గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు
- మినీ లారీని ఢీకొట్టి అగ్నికీలల్లో చిక్కుకున్న బస్సు
- 8 మంది హైదరాబాదీల సజీవ దహనం
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావులకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు.