YSRCP: బుల్లెట్‌పై విజ‌య‌సాయిరెడ్డి...విజ‌య‌వాడ నుంచి తాడేప‌ల్లికి వైసీపీ బైక్ ర్యాలీ

  • సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న జ‌గ‌న్‌
  • ఈ సంద‌ర్భంగా బైక్ ర్యాలీ చేప‌ట్టిన వైసీపీ యువ‌జ‌న విభాగం
  • బుల్లెట్ బండెక్కి హుషారుగా క‌నిపించిన సాయిరెడ్డి
vijay sai reddy spotted on bullet in ysrcp bike rally

ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడేళ్ల ప‌ద‌వీ కాలాన్ని ముగించుకున్న సంద‌ర్భంగా వైసీపీ నేత‌లు విజ‌య‌వాడ నుంచి తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యం దాకా బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ బైక్ ర్యాలీలో స్వ‌యంగా పాలుపంచుకున్న ఆ పార్టీ ఎంపీ వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి...బుల్లెట్‌ను న‌డుపుతూ ఉత్సాహంగా క‌నిపించారు. పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ బైక్ ర్యాలీలో పార్టీకి చెందిన యువ నేత‌లు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకున్నారు.

More Telugu News