వాళ్లిద్దరూ నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు: రామ్ గోపాల్ వర్మ
- పంజాగుట్ట పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
- నట్టి క్రాంతి, నట్టి కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న వర్మ
- వారికి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని ఆరోపణ
2020 నవంబర్ 30న తన లెటర్ హెడ్ తీసుకున్నారని... ఆ తర్వాత నకిలీ పత్రాలను సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలిపారు. వారికి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని చెప్పారు. ఈ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వాస్తవాలను తేల్చాలని కోరారు. తన సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉందని... కానీ నకిలీ పత్రాలతో కేసులు వేసి సినిమా విడుదలను అడ్డుకున్నారని ఆరోపించారు.