అమ్మఒడి పథకంపై మాటతప్పి, మడమతిప్పారు: సీపీఐ రామకృష్ణ
- తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు వేయాలన్న రామకృష్ణ
- ప్రభుత్వం రూ. 13 వేలు మాత్రమే వేయాలనుకుంటోందని విమర్శ
- పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ. 1000 కోత విధించారన్న సీపీఐ నేత
పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రూ. 1000 కోత విధించారని, ఇప్పుడు మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ. 1000 తగ్గించబోతున్నారని రామకృష్ణ విమర్శించారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.