IPL 2022: గెలిచి నిల‌వాల్సిన మ్యాచ్‌... టాస్ నెగ్గి ఛేజింగ్ ఎంచుకున్న పంజాబ్‌

  • డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్‌
  • ఢిల్లీ కేపిట‌ల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య పోరు   
  • ఢిల్లీకి ఫ‌స్ట్ బ్యాటింగ్ అప్ప‌గించిన వైనం
Punjab Kings won the toss and elected to field

ఇటు ఢిల్లీ కేపిట‌ల్స్‌, అటు పంజాబ్ కింగ్స్‌...ఈ రెండు జ‌ట్ల‌కు మ‌రికాసేప‌ట్లో మొద‌లు కానున్న లీగ్ మ్యాచ్ అత్యంత కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తే... దానికి ప్లే ఆఫ్స్ ఆశ‌లు సజీవంగా ఉంటాయి. అదే స‌మ‌యంలో ఓడిన జ‌ట్టు మాత్రం ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను పూర్తిగా వ‌దిలేసుకోక త‌ప్ప‌దు. వెర‌సి ఈ మ్యాచ్ రెండు జట్ల‌కు గెలిచి నిల‌వాల్సిన మ్యాచ్‌గానే ప‌రిణ‌మించింది. 

కాసేప‌టి క్రితం టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ఛేజింగ్‌ను ఎంచుకుంది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆ జ‌ట్టు ఢిల్లీని ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఇప్ప‌టిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన ఇరు జ‌ట్లు... 6 విజ‌యాల చొప్పున 12 పాయింట్లు సాధించాయి. అయితే నెట్ ర‌న్ రేట్ మెరుగ్గా ఉన్న ఢిల్లీ ఐదో స్థానంలో కొన‌సాగుతుండ‌గా... పంజాబ్ మాత్రం 7వ స్థానంలో ఉంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో మ‌రికాసేప‌ట్లోనే పంజాబ్ త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

More Telugu News